అగ్నిప్రమాదం.. రూ.3లక్షల ఆస్తి నష్టం
ABN , First Publish Date - 2021-06-20T05:23:19+05:30 IST
మండలంలోని అమీన్సాహెబ్పాలెం గ్రామం ఎస్టీకాలనీలో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
నాదెండ్ల, జూన్ 19: మండలంలోని అమీన్సాహెబ్పాలెం గ్రామం ఎస్టీకాలనీలో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సాయంత్రం ఈదురుగాలు వీచడంతో ఓ ఇంట్లోని పొయ్యిలోని నిప్పురవ్వలు ఎగసిపడి గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఇండ్ల రామయ్య గుడిసెతోపాటు తుపాకుల చెంచమ్మ, ఈగ పెద్దులు, పొట్లూరి నాగమల్లేశ్వరరావు, రాపూరి వెంకటేశ్వర్లు, బాపట్ల రమేష్లకు చెందిన పూరిళ్లు అగ్నికి హుతయ్యాయి. నరసరావుపేట, చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.3లక్షలకు పైగా ఆస్తి నష్టం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.