పోలవరం ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2021-04-24T04:53:52+05:30 IST
పోలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది.
పోలవరం, ఏప్రిల్ 23: పోలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు కం ప్యూ టర్లు, ప్రింటర్ కం స్కానర్, ఎల్ ఈడీ సుమారు రూ.2లక్షలు విలువైన పరికరాలు దగ్ధమయ్యాయని వైద్య శాల డిప్యూటీ డ్రాయింగ్ అథారిటీ ఆఫీసర్ ఎండీ సుకూర్ తెలిపారు. 15 ఏళ్లుగా నమోదైన జనన, మరణాల జాబితాలు, ఐదేళ్ల సీసీ కెమెరాల పుటేజీ, ఆరోగ్యశ్రీ జాబితాలు, ఇతర వివ రాలు దగ్ధమయ్యాయని తెలిపారు. కంప్యూటర్ రికార్డు రూమ్ వార్డులకు దూరంగా ఉండడం వల్ల చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని తెలిపారు.