వెల్డింగ్ చేస్తుండగా మంటలు.. లారీ దగ్ధం
ABN , First Publish Date - 2021-04-22T05:38:18+05:30 IST
వెల్డింగ్ పనులు చేస్తుం డగా మంటలు ఎగసిపడి లారీ పూర్తిగా దగ్ధమైంది.
తాడేపలిగూడెం రూరల్, ఏప్రిల్ 21: వెల్డింగ్ పనులు చేస్తుం డగా మంటలు ఎగసిపడి లారీ పూర్తిగా దగ్ధమైంది. తాడేపల్లి గూడెంకు చెందిన ఇమ్మంది కల్యాణ్కు చెందిన లారీ మరమ్మ తుల నిమిత్తం వెల్డింగ్ పనులు చేయిస్తున్నారు. ట్యాంకులో పె ట్రోలు ఉండటంతో నిప్పు రవ్వలు ఎగసిపడి.. మంటలు రావ డంతో నిమిషాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. స్థానిక అగ్నిమా పక అధికారి జీవీ రామారావు పర్యవేక్షణలో మంటలు మరింత విస్తరించకుండా అదుపు చేశారు. ఆస్తి నష్టం రూ.18 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.