Fire accident: రంగారెడ్డిలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-10-02T13:42:57+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా 315 పిల్లర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా 315 పిల్లర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ దుకాణంలో అకస్మాత్తుగా మంగలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.