సరూన్ సెలూన్లో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2022-06-29T06:01:33+05:30 IST
గ్రేటర్ 16వ వార్డు హెచ్బీకాలనీలోని సరూన్ సెలూన్లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది మధ్యాహ్న భోజనం అనంతరం షట్టర్ను మూసివేసి ఓన ర్ వి.సాయి ఇంటికి వెళ్లగా, పనిచేసే గౌరీశంకర్ సెలూన్లో సేదతీరాడు. సాయంత్రం అతడు సెలూన్ వెనుక భాగంలోని వాష్రూమ్కు వెళ్లగా, అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో కిటీకి నుంచి కిందకి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
వెంకోజీపాలెం, జూన్ 28: గ్రేటర్ 16వ వార్డు హెచ్బీకాలనీలోని సరూన్ సెలూన్లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది మధ్యాహ్న భోజనం అనంతరం షట్టర్ను మూసివేసి ఓన ర్ వి.సాయి ఇంటికి వెళ్లగా, పనిచేసే గౌరీశంకర్ సెలూన్లో సేదతీరాడు. సాయంత్రం అతడు సెలూన్ వెనుక భాగంలోని వాష్రూమ్కు వెళ్లగా, అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో కిటీకి నుంచి కిందకి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో సెలూన్ మొత్తం కాలిపోయింది. ఇటీవల రూ.5 లక్షలతో సెలూన్ను రూపుదిద్దామని ఓనర్ సాయి వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. ఏడీఎఫ్వో పి.సింహాచలం, ఎస్ఎఫ్వో పి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపుచేశారు.