ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-06-17T05:25:22+05:30 IST

ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోని ఓ భవనంలో ఇవాళ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కన్వర్జెన్స్ బ్లాక్‌లోని ...

ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోని ఓ భవనంలో ఇవాళ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కన్వర్జెన్స్ బ్లాక్‌లోని తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఆగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందనీ.. దీంతో హుటాహుటిన 22 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నామని అధికారులు పేర్కొన్నారు. మంటలను అదుపు చేసేందుకు ఇప్పటికీ ప్రయత్నం జరుగుతోందనీ... అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అగ్నిమాపక దళం అధికారి ఒకరు వెల్లడించారు. 

Updated Date - 2021-06-17T05:25:22+05:30 IST