శబాషీగూడెంలో చెలరేగిన మంటలు
ABN , First Publish Date - 2021-03-01T05:37:43+05:30 IST
చేర్యాల మండలం శబాషీగూడెం గ్రామశివారులోని అటవీభూమిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
చేర్యాల, ఫిబ్రవరి 28: చేర్యాల మండలం శబాషీగూడెం గ్రామశివారులోని అటవీభూమిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సుమారు 30 ఎకరాల మేర మంటలు వ్యాపించి చెట్లు దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై నీటితో ఆర్పడానికి యత్నించారు. సర్పంచు బొడ్డు స్వప్నకిరణ్, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏపీవో మంజుల విషయాన్ని అటవీ, అగ్నిమాపక, పోలీస్ అధికారులకు తెలపడంతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్తో మంటలు ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.