ఏపీఆర్డీసీ సెట్లో జిల్లా విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
ABN , First Publish Date - 2022-07-01T06:23:36+05:30 IST
నాగార్జునసాగర్లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన ‘ఏపీఆర్డీసీ సెట్’లో మండలంలోని ముకుందరాజుపేట గ్రామానికి చెందిన దార్ల దుర్గాప్రసాద్ ఆర్ట్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు
ఏపీఆర్డీసీ సెట్లో జిల్లా విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
సత్తాచాటిన ముకుందరాజుపేటకు చెందిన దుర్గాప్రసాద్
నక్కపల్లి, జూన్ 30: నాగార్జునసాగర్లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన ‘ఏపీఆర్డీసీ సెట్’లో మండలంలోని ముకుందరాజుపేట గ్రామానికి చెందిన దార్ల దుర్గాప్రసాద్ ఆర్ట్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఇతను నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. దుర్గాప్రసాద్ను కళాశాల ప్రిన్సిపాల్ కె.శైలజ, ఎన్ఎస్ఎస్ పీవో అప్పారావు, అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, భవిష్యత్తులో సివిల్స్ను లక్ష్యంగా చేసుకుని ఆర్ట్స్ గ్రూపులో చేరడానికి ప్రవేశ పరీక్ష రాశానని చెప్పాడు.