మునుగోడు టిక్కెట్ పద్మశాలీలకు కేటాయించాలి
ABN , First Publish Date - 2022-08-10T06:24:12+05:30 IST
మునుగోడు టిక్కెట్ను అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకే కేటాయించాలని పద్మశాలీ సంఘం అఖిల భారత అధ్యక్షుడు కందగట్ల స్వామి డిమాండ్ చేశారు.
చండూరు, ఆగస్టు 9: మునుగోడు టిక్కెట్ను అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకే కేటాయించాలని పద్మశాలీ సంఘం అఖిల భారత అధ్యక్షుడు కందగట్ల స్వామి డిమాండ్ చేశారు. మంగళవారం చండూరులోని మార్కండే య దే వాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం లో అధిక శాతం ఓట్లు ఉన్న పద్మశాలీలకు ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించాలని కో రారు. నియోజకవర్గం ఏర్పాటైనప్పుడు కొండా లక్ష్మణ్బాపూజీ ఎన్నికయ్యారని, నే టి వరకు పద్మశాలీలకు టిక్కెట్ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చేనేత విభాగం ఆలిండియా అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న, జనరల్ సెక్రటరీ గడ్డం జగన్నాథం, మహిళా అధ్యక్షురాలు వనం దుశ్యంతల, నాయకులు రాధిక, నారాయ ణ, వీరేశం, శ్రీనివాసులు, వెంకటేశం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు