రూ.10కే కేజీ చేపలు.. అయినా కొనేవారులేరు..!

ABN , First Publish Date - 2020-09-04T01:00:49+05:30 IST

రూ. 10కే కిలో చేపలన్నా కొనే నాథుగే కరువయ్యాడు. బయట మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతున్నచేపల ధర ఆకువీడు మార్కెట్‌లో..

రూ.10కే కేజీ చేపలు.. అయినా కొనేవారులేరు..!

ఏలూరు: రూ.10కే కిలో చేపలన్నా కొనే నాథుడే కరువయ్యాడు. బయట మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతున్నచేపల ధర ఆకువీడు మార్కెట్‌లో ఈ రోజు పది రూపాయలకు పడి పోయింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకువీడు పరిసర చెరువుల్లో సుమారు 40 టన్నుల చేపలు పైకి తేలాయి. వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల ఆక్సిజన్ అందక చేపలు పైకి తేలడంతో ఆకువీడు మార్కెట్‌కు తరలించారు. తేలిన చేపలు కావడంతో రూ.10కి కిలో చొప్పున అమ్మేందుకు సిద్ధపడినా కొనేందుకు స్థానికులు ఆసక్తి చూపలేదు. 

Updated Date - 2020-09-04T01:00:49+05:30 IST