మత్స్యగిరీశుడి హుండీ ఆదాయం 9.42లక్షలు
ABN , First Publish Date - 2022-07-01T06:44:32+05:30 IST
మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైన దేవస్థాన హుండీని గురువారం లెక్కించారు.
వలిగొండ, జూన 30: మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైన దేవస్థాన హుండీని గురువారం లెక్కించారు. మూడు నెలల ఐదు రోజులకు గాను రూ.9,42,988 ఆదాయం సమకూరింది. ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి డివిజన ఇన్సపెక్టర్ సుమతి, ఆలయ ఈవో మోహనబాబు, ఆలయ రెనోవేషన కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.