మత్స్యకార పథకాలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-06-22T07:11:09+05:30 IST

మత్య్సకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని చాంబర్‌లో సోమవారం మత్య్సకార పథకాల జిల్లాస్థాయికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 210 యూనిట్లపంపిణీ లక్ష్యం కాగా 128 యూనిట్ల పంపిణీకి జిల్లా కమిటీ ఆమోదించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

మత్స్యకార పథకాలపై అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

- కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశం

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 21 : మత్య్సకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని చాంబర్‌లో సోమవారం మత్య్సకార పథకాల జిల్లాస్థాయికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 210 యూనిట్లపంపిణీ లక్ష్యం కాగా 128 యూనిట్ల పంపిణీకి జిల్లా కమిటీ ఆమోదించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆయా పథకాల కింద ఏడాదిలో రూ. 5.50 కోట్ల నిధులు పంపిణీ చే యాల్సి ఉండగా ప్రస్తుతం రూ. 2.60 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.. 210 యూనిట్లకు గాను 398 దరఖాస్తులు వచ్చాయని,అందులో 128  మందిని అర్హులుగా గుర్తించివారికి యూనిట్లు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జే వెంకటముర ళీ, మత్య్సశాఖ జెడీ చంద్రశేఖర్‌ రెడ్డి, జడ్సీ సీఈఓ కైలాష్‌ గిరీశ్వర్‌, వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డయ్య, డీఆర్‌డీఎ పీడీ బాబురావు, ఎల్‌డీఎం యుగంధర్‌ రెడ్డి, మత్య్సశాఖ ఏడీ రఘునాథ్‌బాబు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-06-22T07:11:09+05:30 IST