హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-05-11T05:45:10+05:30 IST

కంది మండల పరిధిలోని కొయ్యగుండు తండాలో గత నెల లో ఓ ఇంటిపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం చేసిన ఐదుగురు నిందితులను సోమవారం రాత్రి సంగారెడ్డి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్‌

కంది, మే 10: కంది మండల పరిధిలోని కొయ్యగుండు తండాలో గత నెల లో ఓ ఇంటిపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం చేసిన ఐదుగురు నిందితులను సోమవారం రాత్రి సంగారెడ్డి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.  ఎస్‌ఐ సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం..కొయ్యగుండు గ్రామానికి చెందిన  విశాల్‌ అతని భార్య శిరీషపై ఏప్రిల్‌ 18న అదే గ్రామానికి చెందిన నేనావత్‌ శంకర్‌ (38), నేనావత్‌ సురేష్‌(35), నేనావత్‌ మోత్యా(50), నేనావత్‌ ప్రసాద్‌(28), నేనావత్‌ ప్రకాష్‌(32) పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని దాడి చేశారు. ఈ దాడిలో విశాల్‌, శిరీషకు తీవ్రగాయాలయ్యాయి. అప్పుడు నిందితులు పరారీలో ఉన్నారు. అదే రోజున హత్యాయత్నం జరిగిందని సంగారెడ్డి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి విచారణ చేపట్టిన సంగారెడ్డి రూరల్‌ పోలీసులు సోమవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపారు. 

Updated Date - 2021-05-11T05:45:10+05:30 IST