రూ. కోటి 12 లక్షల లంచం కేసులో రెండోరోజు నిందితుల కస్టడీ

ABN , First Publish Date - 2020-09-22T21:31:25+05:30 IST

రూ. కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ అధికారులు రెండో రోజు మంగళవారం ఐదుగురు నిందితులను..

రూ. కోటి 12 లక్షల లంచం కేసులో రెండోరోజు నిందితుల కస్టడీ

హైదరాబాద్: రూ. కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ అధికారులు రెండో రోజు మంగళవారం ఐదుగురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఆర్డీవో అరుణారెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్‌తోపాటు మరో నలుగురిని విచారిస్తున్నారు. మరోవైపు నగేష్ బ్యాంక్ లాకర్‌పై ఇంకా చిక్కుముడి వీడలేదు. రూ. 40 లక్షలు ఎక్కడున్నాయన్నదానిపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో మాజీ కలెక్టర్ నగేష్ ప్రమేయం ఎక్కవగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2020-09-22T21:31:25+05:30 IST