కుటుంబసమేతంగా ఐదు రోజులు విదేశాల్లోనే..

ABN , First Publish Date - 2022-06-28T02:03:43+05:30 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మొన్నదావోస్‌కు వెళ్లింది అధికారిక పర్యటన కాగా.. ఇప్పుడు ఫ్రాన్స్‌కు

కుటుంబసమేతంగా ఐదు రోజులు విదేశాల్లోనే..

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మొన్నదావోస్‌కు వెళ్లింది అధికారిక పర్యటన కాగా.. ఇప్పుడు ఫ్రాన్స్‌కు వెళ్తున్నది పూర్తిగా వ్యక్తిగతం. జూన్ 28వ సాయంత్రం 7.30‌కు ఫ్రాన్స్‌కు బయల్దేరుతారు. పారిస్‌లో ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో జగన్ పెద్ద కూతురు హర్షిణి రెడ్డి మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. జూలై 2న బిజినెస్ స్కూల్లో జరిగే కాన్వొకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు. జూలై 3వ తేదీ ఉదయం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

Updated Date - 2022-06-28T02:03:43+05:30 IST