Chhattisgarhలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2022-03-16T14:52:20+05:30 IST

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు...

Chhattisgarhలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురి మృతి

 17మందికి గాయాలు

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. గరియాబంద్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోని జోబా వద్ద వేగంగా వస్తున్నట్రక్కు ట్రాక్టరు ట్రాలీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. 14 మంది క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రాయపూర్ ఆసుపత్రికి తరలించామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విశ్వదీప్ యాదవ్ చెప్పారు. ఓ వేడుకకు హాజరై ట్రాక్టరు ట్రాలీలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాం జరిగింది.రోడ్డు ప్రమాదంలో మృతులకు చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బాగేల్ సంతాపం తెలిపారు.


Updated Date - 2022-03-16T14:52:20+05:30 IST