ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు డ్యామ్‌లో మునిగి దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-03T12:08:50+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మల్వా జిల్లాలోని పటేటీ డ్యామ్ లో మునిగి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు....

ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు డ్యామ్‌లో మునిగి దుర్మరణం

అగర్ మల్వా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మల్వా జిల్లాలోని పటేటీ డ్యామ్ లో మునిగి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు పచేటీ డ్యామ్ లో మునిగి విగతజీవులుగా మారారు. రాంకన్య, సునీత, జయ, అల్కా, అభిషేక్ ల మృతదేహాలను డ్యామ్ నుంచి సహాయ బృందం వెలికి తీసింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కకరికి 4లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మధ్యప్రదేశ్ సర్కారు ప్రకటించింది. డ్యామ్ లో మునిగి మరణించిన ఐదుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున, అంత్యక్రియల కోసం మరో రూ.5వేలను ఇస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ముగ్గురు పిల్లలతోపాటు ఇద్దరు మహిళలు డ్యామ్ మునిగి మరణించారని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందం మృతదేహాలను వెలికితీసిందని జిల్లా కలెక్టరు అవదేష్ శర్మ చెప్పారు. 

Updated Date - 2020-12-03T12:08:50+05:30 IST