పంజాబ్ Congressలో ఆగని వలసల పర్వం

ABN , First Publish Date - 2022-06-04T22:13:51+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్‌లో వలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీకి మరికొందరు నేతలు ఉద్వాసన..

పంజాబ్ Congressలో ఆగని వలసల పర్వం

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్‌లో వలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీకి మరికొందరు నేతలు ఉద్వాసన చెప్పనున్నారు. కాంగ్రెస్ పార్టీ పంజాబ్ విభాగానికి చెందిన ఐదుగురు ప్రముఖ నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీని వీడి వీరంతా బీజేపీలో చేరనున్నారు.వీరిలో పంజాబ్ మాజీ మంత్రులు గుర్‌ప్రీత్ సింగ్ కంగార్, బల్బీర్ సింగ్ సిద్ధు, రాజ్‌కుమార్ వర్క, సుందర్ శ్యామ్ అరోరా, మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ థిల్లార్ ఉన్నారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ రాజీనామా చేశారు. అనంతరం బీజేలో చేరారు.

Updated Date - 2022-06-04T22:13:51+05:30 IST