Romania నుంచి ఢిల్లీ చేరిన విమానం...200మంది భారతీయుల రాక

ABN , First Publish Date - 2022-03-08T13:07:06+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది...

Romania నుంచి ఢిల్లీ చేరిన విమానం...200మంది భారతీయుల రాక

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఉక్రెయిన్ దేశం నుంచి రొమేనియాలోని సుసెవా సరిహద్దు ప్రాంతానికి వచ్చిన 200 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారు.‘‘మేం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బాంబు దాడులు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం, మా ఎంబసీ మాకు సహాయం చేశాయి... మేము తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన ఒక విద్యార్థి చెప్పారు ఉక్రెయిన్ లో ఉన్న ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అనుమతించాలని ఐక్యరాజ్యసమితి ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్ అభ్యర్థించారు.


ఈ నేపథ్యంలో మార్చి 10న  రష్యాతో సమావేశం కాబోతున్నట్లు  ఉక్రేనియన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా  చెప్పారు.కాగా ఖార్కివ్ సమీపంలో రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్‌ను ఉక్రెయిన్ బలగాలు కాల్చిచంపాయని ఉక్రెయిన్ చీఫ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ మంగళవారం చెప్పారు.


Updated Date - 2022-03-08T13:07:06+05:30 IST