ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. మొబైల్ ఫోన్లపై బ్రహ్మాండమైన ఆఫర్లు!
ABN , First Publish Date - 2020-11-27T00:19:58+05:30 IST
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో నేడు ప్రారంభమైన బ్లాక్ఫ్రైడే సేల్ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. సేల్లో భాగంగా షియోమి, రియల్మి
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో నేడు ప్రారంభమైన బ్లాక్ఫ్రైడే సేల్ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. సేల్లో భాగంగా షియోమి, రియల్మి, శాంసంగ్, యాపిల్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్లపై ఫ్లిప్కార్ట్ పలు ఆఫర్లు ప్రకటించింది. ఎస్బిఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం క్యాష్బ్యాక్ లభించనుంది.
బ్లాక్ఫ్రైడే సేల్లో భాగంగా రియల్మి నర్జో 20 ప్రొ 6జీబీ+64 జీబీ స్టోరేజీ వేరియంట్ను రూ. 13,999కి, పోకో ఎం2ను రూ.9,999కి సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 6జీబీ+64 జీబీ స్టోరేజీ మోడల్ను రూ. 500 రాయితీతో రూ. 15,499కే అందిస్తోంది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (2020) బేస్ మోడల్ 64జీబీ స్టోరేజీ వేరియంట్ను రూ. 32,999కే అందిస్తోంది. దీని అసలు ధర రూ. 39,900. ఐఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 47,900 నుంచి రూ. 38,999కి తగ్గించింది. మోటొరోలా జి9 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్ మొబైల్ను రూ. 9,999కే అందుబాటులో ఉంచింది. ఇది అసలు ధరకంటే రూ.2,500 తక్కువ.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20ప్లస్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 49,999 కాగా, దీనిని ఇప్పుడు రూ. 35,498కే సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ నోట్ 10 ప్లస్ 12జీబీ+256 స్టోరేజీ వేరియంట్ను రూ. 54,999కే కొనుగోలు చేసుకోవచ్చు. స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్లో రూ. 38,998కే సొంతం చేసుకోవచ్చు.
ఒప్పో ఎఫ్ 15 4జీబీ ర్యామ్+128 స్టోరేజీ స్మార్ట్ఫోన్ను రూ. 2 వేల రాయితీతో రూ. 14,990కే అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎ70, ఎల్జీ జి8ఎక్స్, మోటొరోలా రేజర్ (2019), మోటో జి 5జి (ఈ నెల 30న విడుదల), రియల్2మి ఎక్స్ 50 ప్రొ, రియల్మి బడ్స్ ఎయిర్ నియో, రియల్మి స్మార్ట్ కేమ్ 360, రియల్మి వాచ్, రియల్మి బడ్స్ క్యూ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్లు, రియల్మి బడ్స్ ఎయిర్ ప్రొ వంటి వాటిపై భారీ తగ్గింపు ప్రకటించింది.