
హైదరాబాద్: మహిళా సంఘాల వస్తువులు ఆన్లైన్లో ప్రభుత్వం విక్రయించనుంది. ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యం ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ (సెర్ప్) అధ్వర్యంలోని మహిళా సంఘాల వస్తువులు ఎఫ్ పీవోలు సేకరించిన ధాన్యం ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్లిప్ కార్ట్ సంస్థను ఎంపిక చేసింది. శనివారం హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, ప్లిప్ కార్ట్ ఉపాధ్యక్షుడు రవిచంద్రన్ లు ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు.