A washed away bridge: వరదలకు కొట్టుకుపోయిన వంతెన
ABN , First Publish Date - 2022-07-24T14:51:34+05:30 IST
తిరుపత్తూర్ జిల్లాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆండియప్పనూర్ డ్యాం పూర్తిస్థాయిలో నిండింది. డ్యాంకు వరద ఉధృతి అధికంగా
వేలూరు(చెన్నై), జూలై 23: తిరుపత్తూర్ జిల్లాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో ఆండియప్పనూర్ డ్యాం పూర్తిస్థాయిలో నిండింది. డ్యాంకు వరద ఉధృతి అధికంగా ఉండడంతో బొమ్మికుప్పం నేల వంతెన వరద(Flood)ల్లో కొట్టుకుపోయింది. దీంతో, అన్నా నగర్, కలైంజర్ నగర్ సహా 10 గ్రామాలకు రాకపోకలు(Arrivals) నిలిచిపోయాయి. వాహనాలను మరో మార్గంగా మళ్లించిన ప్రజాపనుల శాఖ అధికారులు, వంతెన పునర్నిర్మించే పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.