Konaseema Dist: వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన వరద బాధితులు
ABN , First Publish Date - 2022-07-21T17:37:32+05:30 IST
ముమ్మడివరం మండలం వరద ముంపు బాధితులు వైసీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోనసీమ జిల్లా (Konaseema District): ముమ్మడివరం మండలం వరద ముంపు బాధితులు (Flood Victims) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద సమయంలో తమకు ఏలాంటి సహాయం అందలేదని పర్యటను వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ముందే గ్రామస్తులు అన్నారు. ముమ్మడివరం మండలం, కమిని గ్రామాన్ని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ (MLA Ponnada Satish Kumar) సందర్శించారు. వరద ఉధృతి గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చినా.. పెద్ద పడవులు అందుబాటులో ఉంచలేదని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. తాగు నీటిని మూడురోజులకు ఒకసారి ఇచ్చారని బాధితులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్థానిక సర్పంచ్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించివేశారు. తమను పట్టించు కోలేదంటూ గ్రామస్థులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.