మార్కెట్లో పూల సందడి
ABN , First Publish Date - 2020-10-24T11:04:22+05:30 IST
బతుకమ్మ సందర్భంగా మూడు రోజుల నుంచి మార్కెట్లో పూల సందడి నెలకొంది. కరోరా పరిస్థితుల్లో వెలవెలబోయిన మార్కెట్ శక్రవారం ఒక్కసారిగా పుంజుకుంది
చుక్కలు చూపుతున్న ధరలు
్జకరీంనగర్ కల్చరల్, అక్టోబరు 23 : బతుకమ్మ సందర్భంగా మూడు రోజుల నుంచి మార్కెట్లో పూల సందడి నెలకొంది. కరోరా పరిస్థితుల్లో వెలవెలబోయిన మార్కెట్ శక్రవారం ఒక్కసారిగా పుంజుకుంది. మరోవైపు పూల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు రకరకాల పూలు తెచ్చి మార్కెట్లో అమ్మారు. తంగెడు పూలు 2కట్టలకు 20రూపాయలు చొప్పున అమ్మగా గునుగు చిన్న మోపుకే 100పలికింది. పట్టుకుచ్చులు, పోకబంతులు, కట్టలు కట్టి విక్రయించగా వాటితో పాటు బంతి, చేమంతి పూలు 60నుంచి 80రూపాయల వరకు పలికాయి. కమలం, తామర, లిల్లీ పూలు 10 రూపాయలకు 2చొప్పున విక్రయించారు. ఒక మోస్తరు బతుకమ్మ తయారీ కోసం 700ల నుంచి 1000ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని మహిళలు వాపోయారు. అలాగే వస్త్ర, వాణిజ్య నిలయాలు జనంతో సందడిగా కనిపించాయి. గ్రామాల నుంచి వచ్చిన జనంతో మార్కెట్ రద్దీగా కనిపించింది.