నేరాల నియంత్రణపై దృష్టి సారించండి
ABN , First Publish Date - 2022-05-28T06:57:09+05:30 IST
నగరంలో నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని సీపీ సీహెచ్.శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు.
క్రైమ్ విభాగం అధికారులకు సీపీ ఆదేశం
విశాఖపట్నం, మే 27(ఆంధ్రజ్యోతి): నగరంలో నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని సీపీ సీహెచ్.శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. కమిషనరేట్లోని సమావేశ మందిరంలో క్రైమ్ విభాగం అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నేరాలు జరగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రాత్రి గస్తీని పటిష్టం చేయాలని సూచించారు. చోరీ కేసుల్లో రికవరీ శాతం పెరిగేలా నిందితులను గుర్తించి అరెస్టు చేయడం, పాత నేరస్తులపై నిఘా పెట్టడం చేయాలన్నారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.