అసాంఘిక శక్తులపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2022-09-24T06:44:26+05:30 IST

ఇతర రాష్ట్రాలలో ఉంటూ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ అధికారులకు సూచించారు.

అసాంఘిక శక్తులపై దృష్టి సారించండి
సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీపీ, ఇతర అధికారులు

సిబ్బందికి సీపీ శ్రీకాంత్‌ ఆదేశాలు

మహారాణిపేట, సెప్టెంబరు 23: ఇతర రాష్ట్రాలలో ఉంటూ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు కమిషనరేట్‌లో ఏడీసీపీలు, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో యాక్టివ్‌గా ఉంటూ అరెస్టు కాని రౌడీ షీటర్ల వివరాలను సీపీ ఆరా తీశారు. స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. క్రైమ్‌, ట్రాఫిక్‌ విబాగాల పనితీరును సమీక్షించారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరిచిన 20 మంది పోలీసులకు రివార్డులు, ప్రశంశా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు సుమిత్‌ సునీల్‌గరుడ్‌, జి.నాగన్న పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T06:44:26+05:30 IST