కేసుల పరిష్కారంపై శ్రద్ధ పెట్టండి: జడ్జి

ABN , First Publish Date - 2021-12-05T04:31:39+05:30 IST

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 11న జరిగే జాతీయ మెగా లోక్‌అదాలతలో పెండింగ్‌ కేసులను పరిష్కరించేలా పోలీసు అధికారులు శ్రద్ధ వహించాలని ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజనఉదయ్‌ ప్రకాష్‌ సూచించారు.

కేసుల పరిష్కారంపై శ్రద్ధ పెట్టండి: జడ్జి

ఆత్మకూరు, డిసెంబరు 4: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 11న జరిగే జాతీయ మెగా లోక్‌అదాలతలో పెండింగ్‌ కేసులను పరిష్కరించేలా పోలీసు అధికారులు శ్రద్ధ వహించాలని ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజనఉదయ్‌ ప్రకాష్‌ సూచించారు. శుక్రవారం స్థానిక కోర్టుహాల్‌లో ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లి, పాములపాడు పోలీసుస్టేషన్ల కోర్టు కానిస్టేబుల్స్‌తో పాటు న్యాయవాదులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సివిల్‌, బ్యాంకింగ్‌, కుటుంబ తగాదాలు, భార్యాభర్తల గొడవలు, రాజీ చేసుకొని క్రిమినల్‌ కేసులు, రూ.2లక్షల లోబడి ఉన్న చెక్‌బౌన్స కేసులను లోక్‌అదాలత ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఉందని చెప్పారు. పెండింగ్‌ కేసులను రాజీ చేసేందుకు ఎస్‌ఐలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. సమావేశంలో బార్‌ అసోసియేషన అధ్యక్షుడు కేశవరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-05T04:31:39+05:30 IST