ట్రాఫిక్ నిబంధనలు పాటించండి
ABN , First Publish Date - 2020-11-29T04:36:26+05:30 IST
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధ నలు పాటించాలని సీఐ జి.గోవిందరావు పిలుపునిచ్చారు.
కొత్తవలస / శృంగవరపుకోట రూరల్ :
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధ నలు పాటించాలని సీఐ జి.గోవిందరావు పిలుపునిచ్చారు. శనివారం కొత్తవలస జంక్షన్లో రహదారి భద్రతపై ప్రజలకు, వాహనచోదకులకు అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్ర మంలో ఎస్ఐ ప్రయాగమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్.కోటలో ఎస్ఐ నీలకంఠం పోతనాపల్లి, సంతగైరమ్మపేట గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. హెచ్సీ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.