అయ్యప్ప భక్తులకు భిక్ష వసతి

ABN , First Publish Date - 2021-12-04T05:40:42+05:30 IST

అయ్యప్ప మాలధారణ భక్తులకు అన్నదానం తమ అదృష్టమని టీడీపీ నేతలు అన్నారు.

అయ్యప్ప భక్తులకు భిక్ష వసతి
అయ్యప్ప భక్తులకు అన్నదానంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

హిందూపురం, డిసెంబరు 3: అయ్యప్ప మాలధారణ భక్తులకు అన్నదానం తమ అదృష్టమని టీడీపీ నేతలు అన్నారు. హిందూపురం పట్టణంలోని బెంగళూరురోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ఆధ్యర్యంలో చేపడుతున్న అన్నదాన కార్యక్రమానికి హిందూపురం టీడీపీ నాయకులు మక్బుల్‌బాష, నబీరసూల్‌, ప్రెస్‌ వెంకటేసులు శుక్రవారం తమ వంతు సాయంగా అయ్యప్ప మాలధారణ భక్తులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మక్బుల్‌బాష, నబీరసూల్‌ మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ భక్తులకు 11ఏళ్లుగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ కొనసాగుతున్న అభినందనీయమన్నారు. ఈఅన్నదానంలో తమ వంతుగా ఓరోజు భక్తులకు అవకాశం కల్పించడం ఆనందం కల్గించిందన్నారు. ఈకార్యక్రమంలో అయ్యప్ప అన్నదాన కమిటీ అధ్యక్షులు డీఈ రమేష్‌, టీడీపీ రాష్ట్ర కమిటి కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, హెచఎంరాము, మోదా రవి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-04T05:40:42+05:30 IST