Tirupati లో చిక్కుకున్న భక్తులకు బస, భోజనం

ABN , First Publish Date - 2021-11-19T12:37:18+05:30 IST

Tirupati లో చిక్కుకున్న భక్తులకు బస, భోజనం

Tirupati లో చిక్కుకున్న భక్తులకు బస, భోజనం

చిత్తూరు జిల్లా/తిరుపతి : తిరుమల యాత్రకు వచ్చిన శ్రీవారి భక్తులను కొండపైకి అనుమతించని కారణంగా.. తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజసత్రాల్లో బస, భోజన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులను జెఈవో వీరబ్రహ్మం ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో గురువారం సాయంత్రం రెండు ఘాట్‌ రోడ్లు మూసేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం రాత్రి ఆయన తిరుపతిలో తనిఖీలు నిర్వహించారు. కపిలతీర్థంలో వరద ఉధృతికి దెబ్బతిన్న మండపానికి మూడు స్తంభాలు కొట్టుకుపోయింది. దీనిని వెంటనే పునరుద్ధరించాలన్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు కపిలేశ్వరస్వామి దర్శనాలను నిలిపివేయాలన్నారు.

Updated Date - 2021-11-19T12:37:18+05:30 IST