ఈ నంబర్లకు కాల్ చేస్తే ఉచితంగా ఫుడ్ డోర్ డెలివరీ..

ABN , First Publish Date - 2021-05-15T16:02:28+05:30 IST

ఆహారంలో బాదం, జీడిపప్పు, కీర, క్యారట్‌, బీట్‌రూట్‌లను కూడా

ఈ నంబర్లకు కాల్ చేస్తే ఉచితంగా ఫుడ్ డోర్ డెలివరీ..

  • ఉచిత ఆహార పంపిణీ
  • తొలిరోజు 50 మందికి డోర్‌ డెలివరీ

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ శ్రీషిర్డీసాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత ఆహార పంపిణీ శుక్రవారం మొదలైంది. కొవిడ్‌ వైరస్‌ బారిన పడి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నవారు సుమారు 50 మంది ఉచిత ఆహారం కోసం సాయి సంస్థాన్‌ను ఆశ్రయించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం, రాత్రి భోజనాలను హోమ్‌ డెలివరీ చేసినట్టు ట్రస్ట్‌ చైర్మన్‌ బచ్చు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి ఈవీవీ నాగేశ్వరరావు శర్మ, అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ గుండా మల్లయ్య, వూర నర్సింహగుప్తా, శ్యామ్‌కుమార్‌, బాబురావు, శ్యామలరావు వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి టిఫిన్‌ కూడా పంపిణీ చేస్తామన్నారు. దూర ప్రాంతాల వారి కోసం సంస్థాన్‌ వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేసి భోజనం పార్శిల్స్‌ను అందజేస్తామన్నారు. ఆహారంలో బాదం, జీడిపప్పు, కీర, క్యారట్‌, బీట్‌రూట్‌లను కూడా చేర్చామన్నారు. అవసరమైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


సైదాబాద్‌, మూసారాంబాగ్‌ డివిజన్లలో...

సైదాబాద్‌, మూసారాంబాగ్‌ డివిజన్ల పరిధుల్లో హోం ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులకు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇంటి వద్దకే వచ్చి భోజనం ఉచితంగా అందించనున్నట్లు సీతారామ సేవా సమితి ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్‌ మలక్‌పేట నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మడిగల విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. అవసరమైనవారు ఫోన్‌ నెంబర్లు 9848050058, 9441697966లలో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-05-15T16:02:28+05:30 IST