పోలీసులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-06-17T05:19:14+05:30 IST

స్థానిక మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో కర్ఫ్యూ విధుల్లో ఉన్న పోలీసులకు, వైద్యా ఆరోగ్య సిబ్బందికి బుధవారం భోజనం ప్యాకెట్లను అందిం చారు.

పోలీసులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ

పాలకొల్లు, జూన్‌ 16: స్థానిక మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో కర్ఫ్యూ విధుల్లో ఉన్న పోలీసులకు, వైద్యా ఆరోగ్య సిబ్బందికి బుధవారం భోజనం ప్యాకెట్లను అందిం చారు. దాత లంకలకోడేరు పీహెచ్‌సీ ఆప్తమాలిక్‌ అధికా రి ఎంఆర్‌కే రాజు ఆర్థిక సా యంతో గాంధీ బొమ్మల సెం టర్‌, లాకుల సెంటర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి అందించారు. సంస్థ అధ్యక్షుడు రేపూరి సూర్యనారాయణ,  కన్వీనర్‌ ముత్యాల రామారావు, కేవీ కృష్ణవర్మ, ధనాని సూర్య ప్రకాశ్‌ పాల్గొన్నారు. 

రైల్వే సిబ్బందికి బియ్యం అందజేత

భీమవరం క్రెం, జూన్‌ 16 : కరోనా సమయంలో రైల్వేశాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి వారికి సహకారం అందించడం విశేషమని భీమవరం టౌన్‌ రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌. దేవకుమార్‌ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో టౌన్‌ రైల్వేస్టేషన్‌లో  రైల్వే సిబ్బందికి బుధవారం బియ్యం పంపిణీ చేశారు. నిర్వాహకుడు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 30 మంది రైల్వే సిబ్బందికి 10 కేజీల బియ్యం చొప్పున కె.సూర్యనారాయణరాజు సౌజన్యంతో పంపిణీ చేశామని తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ సభ్యులు వేలూరి బుజ్జి, పిప్పళ్ళ ప్రసాద్‌, నరహరశెట్టి కృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-17T05:19:14+05:30 IST