మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

ABN , First Publish Date - 2022-08-18T04:15:16+05:30 IST

మెనూ ప్రకారం విద్యా ర్థులకు భోజనంపెట్టాలని అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కస్తూర్బావిద్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు.

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
విద్యార్థుల సామర్థ్యంను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పేయ్‌

- అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

సిర్పూర్‌(టి), ఆగస్టు 17: మెనూ ప్రకారం విద్యా ర్థులకు భోజనంపెట్టాలని అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కస్తూర్బావిద్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతిగదులకు వెళ్లి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సామర్థ్యంను పరీక్షించారు. ఉపాధ్యా యులు విద్యాబోధన పకడ్బందీగా చేయాలన్నారు. వంట గదిలోకి వెళ్లి మధ్యాహ్న భోజనంతో పాటు సరు కులను పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థు లకు వడ్డించాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ఉపాధిహామీ పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొదటి సారిగా మండలానికి రావడంతో ఆమెను ఐకేపీసిబ్బంది సన్మా నించారు. డీఆర్డీఏ ఏపీడీ కుటుంబరావు, ఎంపీడీవో రాజేశ్వర్‌, ఏపీఓ రామ్మోహన్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-18T04:15:16+05:30 IST