అత్యవసర సేవల కోసం..!
ABN , First Publish Date - 2021-07-24T05:09:50+05:30 IST
అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 వాహనాలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బం దులు తలెత్తుతున్న విషయాన్ని ఆ గ్రామ యువకులు గుర్తించారు.. ఒక వాహనాన్ని తామే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.. అనుకున్నదే తడవుగా రూ.2.50 లక్షలతో ఓ వాహనాన్ని కొనుగోలు చేసి దానిలో అంబులెన్స్కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచారు జలగలింగుపురం యువత..
అంబులెన్స్ వాహనం కొనుగోలుచేసి..
స్ఫూర్తిగా నిలిచిన జలగలింగుపురం యువత
మెళియాపుట్టి, జూలై 23: అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 వాహనాలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బం దులు తలెత్తుతున్న విషయాన్ని ఆ గ్రామ యువకులు గుర్తించారు.. ఒక వాహనాన్ని తామే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.. అనుకున్నదే తడవుగా రూ.2.50 లక్షలతో ఓ వాహనాన్ని కొనుగోలు చేసి దానిలో అంబులెన్స్కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచారు జలగలింగుపురం యువత.. రాత్రి సమయాల్లో 108 వాహనం రావడం ఆలస్యం కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో తాము ఆరు నెలల పాటు తల్లిదండ్రులు ఇచ్చిన ఖర్చులను ఒకచోట ఉంచి అం బులెన్స్ను కొనుగోలు చేశామని యువకులు పేర్కొన్నారు. దీనిని శుక్రవారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించి యువతను అభినందించారు.