ఐదు తరగతులకు.. మూడే గదులు

ABN , First Publish Date - 2021-02-26T06:41:42+05:30 IST

మండలంలోని బూదగవి, వెలిగొండ గ్రామాలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.

ఐదు తరగతులకు.. మూడే గదులు
బూదగవిలో ఆగిపోయిన పాఠశాల భవన నిర్మాణం, అసంపూర్తి గదుల్లోనే చదువుకుంటున్న విద్యార్థులు



చెట్ల కిందే విద్యార్థుల చదువులు

వెలిగొండ, బూదగవిలో ఆగిన పాఠశాల నిర్మాణ పనులు


ఉరవకొండ, ఫిబ్రవరి25: మండలంలోని బూదగవి, వెలిగొండ గ్రామాలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో పాఠశాలలో గదుల కొరత కారణంగా చెట్ల కిందనే విద్యనభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాలలో రెండేళ్ల క్రితం ఆర్‌ఎమ్‌ఎ్‌సఏ పథకం కింద అదనపు గదుల నిర్మాణం కో సం పనులు చేపట్టారు. రెండేళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి కాలే దు. బూదగవి గ్రామంలో 2012లో ప్రాథమికోన్నత పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేస్తూ జిల్లా పరిషత్‌ పాఠశాలగా ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలో 6 నుం చి 10వ తరగతి వరకూ 108 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఐ దు తరగతులకు కేవలం మూడు గదులు మాత్రమే ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో అదనపు గదులు నిర్మాణం కోసం రూ.65లక్షలను మంజూ రు చేశారు. నిర్మాణ పనులు రెండేళ్లయినా పూర్తి కాక అర్ధంతరంగా ఆగిపోయాయి. గదుల కొరత కారణంగా అసంపూర్తి భవనంలోనే తరగతులను నిర్వహిస్తున్నారు. 108 మంది విద్యార్థులకు కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ కోణంలోనే పనులు ఆగిపోయాయన్న విమర ్శలు వినిపిస్తున్నాయి. అలాగే మండలంలోని వెలిగొండ గ్రామంలో పాఠశాల అదనపు గదుల నిర్మాణం పనులు నిలిచిపోయాయి. ఈ పాఠశాలలో 107మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో కూడా రెండేళ్ల నుంచి పనులు ఆగిపోయినా పట్టించుకునేవారు కరువయ్యారు. ప లుమార్లు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తిచేసి అదనపు గదులును అందుబాటులోకి తీసుకురావలని కోరుతున్నారు.  

Updated Date - 2021-02-26T06:41:42+05:30 IST