ఇళ్లస్థలాలకు మరో వెయ్యికోట్లు
ABN , First Publish Date - 2020-08-09T09:43:56+05:30 IST
ఇళ్లస్థలాలకు మరో వెయ్యికోట్లు
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఇళ్లస్థలాలకు భూసేకరణ కోసం మరో రూ.1000 కోట్లు విడుదల చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎ్సఆర్ గృహవసతి పథకం కింద భూసేకరణ కోసం జిల్లాలకు రూ.2890.46 కోట్లు చెల్లించేందుకు విడుదల చేయాలని జూన్లో భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) ప్రభుత్వాన్ని కోరగా... ఆర్థికశాఖ తొలుత రూ.1213 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు మరో రూ.1000 కోట్లు విడుదల చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.