కేంద్రంతో కలిసి పని చేస్తా : కేజ్రీవాల్
ABN , First Publish Date - 2022-02-14T18:22:55+05:30 IST
దేశ భద్రత విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజీ పడబోదని
న్యూఢిల్లీ : దేశ భద్రత విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజీ పడబోదని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, పంజాబ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, దేభ భద్రతను పటిష్టపరచడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని చెప్పారు.
పంజాబ్లో రాజకీయ మార్పుతోపాటు సామాన్యుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. అవినీతిమయమైన సంప్రదాయ రాజకీయ పార్టీల నుంచి పంజాబ్ను కాపాడటానికి 2022 శాసన సభ ఎన్నికలు సువర్ణావకాశమని తెలిపారు.
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై ప్రశ్నకు సమాధానంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి భద్రత విషయంలో ఎటువంటి రాజకీయాలు ఉండకూడదన్నారు. అయితే ఈ అంశంపై ఇరు పక్షాలు రాజకీయం చేశాయన్నారు.