ఫోర్బ్స్‌-30 జాబితాలో హైదరాబాదీ..

ABN , First Publish Date - 2022-05-27T06:05:49+05:30 IST

ఎడ్యుటెక్‌ రంగంలోనూ హైదరాబాదీలు దూసుకుపోతున్నారు.

ఫోర్బ్స్‌-30 జాబితాలో హైదరాబాదీ..

  • భాంజూ’ ఫౌండర్‌ నీలకంఠ భానుప్రకాశ్‌కు చోటు 

ఎడ్యుటెక్‌ రంగంలోనూ హైదరాబాదీలు దూసుకుపోతున్నారు. తాజాగా వెలువడిన ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా లిస్ట్‌ 2022’లో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగి స్తున్న మ్యాథ్స్‌ ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ కంపెనీ ‘భాంజూ’ వ్యవస్థాపకుడు నీలకంఠ భానుప్రకాశ్‌ జొన్నలగడ్డకు చోటు దక్కింది. లెక్కల మాంత్రికుడైన భానుప్రకాశ్‌.. పిల్లల్లో లెక్కలంటే ఉండే భయాన్ని పోగోట్టే లక్ష్యంతో ఈ స్టార్టప్‌ కంపెనీని స్థాపించారు. భాంజూ పద్దతి ద్వారా పిల్లలు ఎలాంటి భయం లేకుండా సునాయాసంగా లెక్కలు నేర్చుకోవచ్చని భానుప్రకాశ్‌ అంటున్నారు.


ఈ ఏడాది ఫిబ్రవరిలో భాంజూ.. ఇన్వెస్టర్ల నుంచి 20 లక్షల డాలర్ల (సుమారు రూ.15 కోట్లు) పెట్టుబడులు ఆకర్షించింది. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ లైట్‌స్పీడ్‌తో పాటు పలువురు ఏంజిల్‌ ఇన్వెస్టర్లు ‘భాంజూ’ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ నిధులతో ఈ సంస్థ త్వరలో తన కార్యకలాపాలను అమెరికా, కెనడా, యూకే, పశ్చిమాసియా దేశాలకూ విస్తరించనుంది.

Updated Date - 2022-05-27T06:05:49+05:30 IST