ఆపరేషన్ గంగా.. అధికారులపై విదేశాంగ శాఖ మంత్రి ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2022-03-12T03:07:32+05:30 IST

రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఆపరేషన్ గంగా..! అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అధికారులు భారతీయులను స్వదేశానికి తరలించారు. ఈ బృహత్ కార్యక్రమంలో పాలుపంచుకున్న అధికారులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయ్‌శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఆపరేషన్ గంగా.. అధికారులపై విదేశాంగ శాఖ మంత్రి ప్రశంసల వర్షం

న్యూఢిల్లీ: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఆపరేషన్ గంగా..! అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అధికారులు భారతీయులను స్వదేశానికి తరలించారు. ఈ బృహత్ కార్యక్రమంలో పాలుపంచుకున్న అధికారులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయ్‌శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. 


‘‘ప్రధాని మోదీ సారథ్యంలో ఆపరేషన్ గంగా అనుకున్న విధంగా అమలు కావడం వెనుక గట్టి నాయకత్వం, నిబద్ధత కారణం’ అని పేర్కొన్నారు. అయితే.. సుమీ నుంచి భారతీయులను తరలించడంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని పేర్కొన్నారు. భారతీయుల తరలింపునకు సహాయపడిన ఉక్రెయిన్ పొరుగు దేశాలు, రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2022-03-12T03:07:32+05:30 IST