దేవాదాయశాఖ మాజీ అదనపు కమిషనర్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-08-07T04:17:44+05:30 IST
దేవాదాయశాఖ మాజీ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్పై సస్పెన్షన్
అమరావతి: దేవాదాయశాఖ మాజీ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్పై సస్పెన్షన్ వేటు పడింది. రామచంద్రమోహన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం దేవస్థానం ఈవోగా ఉన్నప్పుడు భూ మార్పిడి అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై వేటు వేశారు. ఇదే ఘటనలో సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సుజాతను కూడా సస్పెండ్ చేశారు.