బీజేపీ నేత ఇంట నలుగురు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-22T11:55:32+05:30 IST

రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు...

బీజేపీ నేత ఇంట నలుగురు ఆత్మహత్య

సీకర్: రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం ఈ కుటుంబంలోని ఒక యువకుడు ఇటీవల మృతిచెందాడు. అప్పటి నుంచి ఇంటిలోని వారంతా మానసిక వ్యథకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వీరిని హనుమాన్ ప్రసాద్, అతని భార్య తార, ఇద్దరు కుమార్తెలు అను, పూజలుగా పోలీసులు గుర్తించారు. 


వీరంతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హనుమాన్ ప్రసాద్ సైనీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీకి సోదరుని కుమారుడు. హనుమాన్ ప్రసాద్ రాసినదిగా భావిస్తున్న సూసైడ్ నోట్‌లో తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత మిగిలిన వారికి బతకాలనే ఆశ లేదని పేర్కొన్నారు. కాగా సమాచారం అందుకున్న వెంటనే సీకర్ జిల్లా ఉద్యోగ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ నాలుగు మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. హనుమాన్ ప్రసాద్ పెద్ద కుమారుడు 2020 సెప్టెంబరులో మృతి చెందాడు.

Updated Date - 2021-02-22T11:55:32+05:30 IST