వైఎస్ కుటుంబంపై చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-06T16:18:55+05:30 IST

వైఎస్ కుటుంబంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయడమే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు.

వైఎస్ కుటుంబంపై చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నం: వైఎస్ కుటుంబంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయడమే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. వైఎస్ సీఎం కాకపోతే...నేడు జగన్ సీఎం కాలేరన్నారు. వైసీపీ వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. విశాఖ, గుంటూరుకు త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని... స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతారన్నారు. మూడు రాజధానులపై జగన్ తొందర పాటు చర్య అని... అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకోవాల్సిందని అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని స్పష్టం చేశారు. త్వరలో ఏపీ పీసీసీలో మార్పులు ఉంటాయని...నేను పీసీసీ అధ్యక్ష రేసులో లేనని చింతా మోహన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-06T16:18:55+05:30 IST