బిజీ బిజీగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-29T05:22:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు.

బిజీ బిజీగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
్ఠవాల్మీకిపురం: విఠలం మాజీ సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డితో మాట్లాడుతున్న మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

వాల్మీకిపురం, మే 28: ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. వాల్మీకిపురం మండలంలో పర్యటించి మండలంలోని విఠలం గ్రామానికి విచ్చేసిన ఆయన తన తండ్రి నల్లారి అమరనాథరెడ్డి స్నేహితుడైన మాజీ సర్పంచ్‌ ఒ.భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లి అన్నా బాగున్నావా అంటూ ఆత్మీయంగా పల కరించారు. తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఉన్న రోజులను గుర్తు చేసుకు ని గ్రామస్తులను పేరుపేరునా పలకరించారు. పార్టీలకు అతీతంగా నా యకులు, నల్లారి అభిమానులు మాజీ సీఎంను కలిశారు. మళ్లీ వస్తానం టూ అభివాదం చేసి బయలుదేరి వెళ్లారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కంభం నిరంజన్‌రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీధ ర్‌రెడ్డి, పీవీ నారాయణ, వలి, కోసూరి రమేష్‌, నారాయణరెడ్డి, జాకీర్‌ హుస్సేన్‌, కేకేనా యుడు, శివన్న, వీరభద్ర, తాహీర్‌అలి, రెడ్డెప్ప, మహిళలు పాల్గొన్నారు. 

ఎల్లుట్ల స్వామి కుటుంబానికి పరామర్శ

మదనపల్లె అర్బన్‌ మే 28: ఇటీవల మృతి చెందిన ఎం. నరసింగారావు (ఎల్లుట్ల స్వామి)కుటుంబ సభ్యులను శనివారం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రె డ్డి పరామర్శించారు. పీలేరు నియోజకవర్గంలోని ఎల్లుట్లకు చెందిన నరసింగారావు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పట్టున్న నా యకుడుగా పేరుంది. కలికిరికి విచ్చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి మదనపల్లెలో ని స్వామి కుమారుడు ఎంఎల్‌ఎన్‌ మూర్తిరావ్‌ నివాసంకు విచ్చేసి స్వా మి భార్యను, కుమారుడు మూర్తిని, కోడలు సుజాతను పరామర్శించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. 

గుర్రంకొండలో:గుర్రంకొండ మండలానికి చెందిన పలువురు అనుచరు లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమా ర్‌రెడ్డి శనివారం మదనపల్లెలో పరామర్శించారు. తమ తండ్రి కాలం నుంచి వెంట ఉన్న అనుచరులను ఆయన పరామర్శించారు. ఈ క్రమం లో గుర్రంకొండ మండలంలోని ఎల్లుట్లకు చెందిన ఎంఎల్‌ఎన్‌మూర్తి రావు, నడిమికండ్రిగకు చెందిన కృష్ణారెడ్డిలు మదనపల్లెలో స్థిరపడ్డారు. వారి కుటుంబాలను ఆయన పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలు సుకొన్నారు. కార్యక్రమంలో ఎల్లుట్ల మురళీ, మేకల చలపతి, సుధాకర్‌, రామాంజులు పాల్గొన్నారు. 


మాజీ సీఎంకు ఘనంగా వీడ్కోలు

కలికిరి, మే 28: స్వంత మండలంలో రెండు రోజులు పర్యటించిన ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి శని వారం  పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకు ముందు ఉదయం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహితులు, అభిమానులను పలకరిస్తూ గడిపారు. పూర్వ చిత్తూరు జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు సుధాకర్‌, సుబ్రమణ్యం, బంగారుపాళెంకు చెందిన కృపాసాగర్‌రెడ్డిలతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న వారు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మార్కెట్‌ కమిటీ మా జీ అధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, ధరణి  సత్యనారాయణ రెడ్డి, ఉమామహే శ్వర్‌రెడ్డి, నల్లారి ఆనందరెడ్డి, శీధర్‌ రెడ్డి, కిరణ్‌ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణప్ప తదితరులు వీడ్కోలు పలికిన వారిలో వున్నారు. 

Updated Date - 2022-05-29T05:22:44+05:30 IST