టీఎంసీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్

ABN , First Publish Date - 2021-08-16T21:13:50+05:30 IST

కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ సోమవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు.

టీఎంసీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్

కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ సోమవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. దీనికి ముందు సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాస్తూ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని, అందుకు నేతలు, సభ్యులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. తన మార్గదర్శకత్వం వహిస్తూ, పలు అవకాశాలు ఇచ్చినందుకు సోనియాగాంధీకి వ్యక్తిగతంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సోనియాగాంధీ అశీస్సులతో ప్రజాసేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. పార్టీ నుంచి రాజీనామా చేసిన అనంతరం ఆమె ట్విట్టర్ బయోలో 'మాజీ సభ్యురాలు, భారత జాతీయ కాంగ్రెస్' అని పేర్కొన్నారు.

Updated Date - 2021-08-16T21:13:50+05:30 IST