విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

ABN , First Publish Date - 2021-07-18T05:04:32+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామలో శనివారం మైయిలా లక్ష్మారెడ్డి (45)అనే రైతు మోటార్‌కు కనెక్షన్‌ ఇస్తూ కరెంట్‌ షాక్‌ గురై మృతి చెందాడు.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

చర్ల, జులై 17: భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామలో శనివారం మైయిలా లక్ష్మారెడ్డి (45)అనే రైతు మోటార్‌కు కనెక్షన్‌ ఇస్తూ కరెంట్‌ షాక్‌ గురై మృతి చెందాడు. లక్మారెడ్డి గొమ్ముగూడెం గ్రామంలో సుమారు 10ఎకరాల వ్యవసాయం చేస్తుంటాడు. వర్షాలు పడడంతో పొలంలో నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇదే క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మోటార్‌కు కనెక్షన్‌ ఇస్తుండగా ఒకవైర్‌ వచ్చి అతని చేతిపై పడింది. దీంతో విద్యుత్‌ షాక్‌గురై అపస్మాకర స్థితికి చేరుకున్నాడు. కొనఊపిరితో ఉన్న అతడిని వైద్యశాలకు తరలిస్తుండా మార్గమధ్యంలో మృతి చెందాడు.  

Updated Date - 2021-07-18T05:04:32+05:30 IST