First list of candidates: దసరా తర్వాత అభ్యర్థుల తొలి జాబితా
ABN , First Publish Date - 2022-09-27T16:06:19+05:30 IST
శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే జేడీఎస్ అభ్యర్థుల తొలి జాబితాను దసరా పండుగ అనంతరం విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. నగరంలో
- మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే జేడీఎస్ అభ్యర్థుల తొలి జాబితాను దసరా పండుగ అనంతరం విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. నగరంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో టార్గెట్ 123తో ముందుకుసాగాలని నిర్ణయించుకున్న పార్టీ తొలి జాబితాను విడుదల చేసి శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని తీర్మానించిందని తెలిపారు. పంచరత్న రథయాత్రల సంచారం అక్టోబరు 6 నుంచి 150 శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తానే స్వయంగా సారథ్యం వహిస్తానని పేర్కొన్నారు. ఇదిలాఉండగా నిర్లిప్తంగా, క్రియాశీలకంగా లేని నేతల్ని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి సాగనంపుతానని కుమారస్వామి ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలను, వచ్చే ఎన్నికలను నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందేనని ఆయన తెగేసి చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం అధ్యక్షత వహించారు.