Komatireddy rajagopal reddy: కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారు

ABN , First Publish Date - 2022-09-19T20:32:44+05:30 IST

ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

Komatireddy rajagopal reddy: కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారు

యాదాద్రి: ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్ (KCR) ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... 1400 యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే కేసీఆర్ (CM KCR) కుటుంబం రాజకీయ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ల పేరు మీద వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం (KCR Family) దోపిడీ చేసిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రపంచంలోని ప్రతి తెలుగు వారు గమనిస్తున్నారని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బందు పథకం పెట్టారని... మునుగోడు ఉప ఎన్నిక (Munugodu by poll)కు గిరిజన బందు పథకం తెస్తున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Former MLA) వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-19T20:32:44+05:30 IST