Balineni srinivas reddy: జనసేనతో టచ్లో ఉన్నాననే ప్రచారం అవాస్తవం
ABN , First Publish Date - 2022-08-10T15:34:53+05:30 IST
జనసేనతో టచ్లో ఉన్నాననే ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రకాశం: జనసేనతో టచ్లో ఉన్నాననే ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni srinivas reddy)అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఊసరవెల్లి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయాల్లో ఉంటే వైసీపీ(YCP)లోనే ఉంటా.. లేకుంటే రాజకీయాలు మానేస్తా అని స్పష్టం చేశారు. పవన్ (Pawan kalyan) చేనేతకు సంబంధించి తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే స్పందించినట్లు వివరించారు. కేటీఆర్ (KTR), పవన్(Janasena chief)కు కూడా ట్వీట్ చేశారని... దాన్ని మాత్రం హైలెట్ చేయరన్నారు. వైసీపీ కార్యకర్తల కోసం ఎంతవరకైనా పోరాడతా అని అన్నారు. కొందరు కావాలని తనను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla madhav) విషయంలో విచారణ జరుగుతోందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.