స్వామివారి ఆశీస్సులు
ABN , First Publish Date - 2021-03-06T04:39:29+05:30 IST
ర్ణాటక రాష్ట్రం ఉడిపి పేజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామి శుక్రవారం కోటలో వెలసిన భూలక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయాన్ని దర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గద్వాల టౌన్, మార్చి 5: కర్ణాటక రాష్ట్రం ఉడిపి పేజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామి శుక్రవారం కోటలో వెలసిన భూలక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయాన్ని దర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆయనకు అర్చకులు, విచారణకర్త ప్రభాకరరావు, రాఘవేంద్రమఠం మేనేజర్ ఉదయ్ స్వాగతం పలికారు. మహామంగళ హారతి అనంతరం స్వామి వారు భక్తులకు ఆశీస్సులు అందించారు. ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్రెడ్డి, జ్యోతి, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కళావతి దంపతులు స్వామిని దర్శిం చుకొని ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన భీంనగర్లోని రాఘవేంద్ర మఠానికి చేరుకుని స్వారి పూజలు చేశారు. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మునిసిపల్ మాజీ చైర్పర్సన్లు టపాల కృష్ణవేణి, బండల పద్మావతి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.