జగన్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం దివాళా: DL Ravindrareddy
ABN , First Publish Date - 2022-06-02T19:18:09+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. జగన్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని తెలిపారు. దావోస్కు జగన్ సొంత పనుల మీద వెళ్లి మూడు కంపెనీలతో ఫేక్ అగ్రిమెంట్లు చేసుకున్నారని అన్నారు. వైఎస్ వివేకాను చంపింది ఎవరో జగన్కు తెలుసన్నారు. కోడి కత్తిలాగా రాజకీయ లబ్ధి కోసమే వివేకా హత్యను ఉపయోగించుకున్నారని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.